ఘోరం : పదహారేళ్ల బాలిక మృతదేహంపై అత్యాచారం...పోస్టుమార్టంలో వెలుగుచూసిన సంచలన విషయాలు

ABN , First Publish Date - 2022-01-04T16:27:10+05:30 IST

కామంతో కళ్లు మూసుకుపోయిన కామాంధులు పదహారేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం చేసి, హతమార్చడమే కాకుండా బాలిక మృతదేహంపై కూడా అత్యాచారం కొనసాగించిన దారుణ ఘటన...

ఘోరం : పదహారేళ్ల బాలిక మృతదేహంపై అత్యాచారం...పోస్టుమార్టంలో వెలుగుచూసిన సంచలన విషయాలు

బుండి (రాజస్థాన్): కామంతో కళ్లు మూసుకుపోయిన కామాంధులు పదహారేళ్ల బాలికపై సామూహిక అత్యాచార యత్నం చేసి, హతమార్చడమే కాకుండా బాలిక మృతదేహంపై కూడా అత్యాచారం కొనసాగించిన దారుణ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని బుండీ పట్టణంలో వెలుగుచూసింది. గత ఏడాది డిసెంబరు 23వతేదీన తప్పిపోయిన పదహారేళ్ల బాలిక మృతదేహమై కనిపించింది. 16 ఏళ్ల బాలిక శవపరీక్ష నివేదికలో దుండగులు అత్యాచారం చేసి హత్య చేసినట్లు తేలింది.దీంతోపాటు ఆమె మరణించిన తర్వాత కూడా బాలిక మృతదేహంపై కూడా నిందితులు అత్యాచారం కొనసాగించారని పోస్టుమార్టంలో తేలింది.బుండి పట్టణ శివార్లలోని పొలాల్లో 16 ఏళ్ల వయసుగల బాలిక మేకలను మేపేందుకు వెళ్లి అదృశ్యమైంది.


ముగ్గురు కామాంధులు గిరిజన బాలికపై సామూహిక అత్యాచారయత్నం చేయగా, ఆమె ప్రతిఘటించడంతో వారు ఆమె గొంతు నులిమి చంపారు.శవపరీక్షలో బాలిక ప్రైవేటు భాగాల్లో 30 కిపైగా గాయాలయ్యాయి. నిందితులు ఆమె శరీరంపై గీతలు వేశారు. బాలికపై అత్యాచారం చేయడానికి ముందు నిందితులు ఆమెను దుపట్టాతో కట్టేసినట్లు పోస్ట్‌మార్టం నివేదిక వెల్లడించింది. ‘‘నా జీవితంలో ఇంత దారుణమైన సంఘటన చూడలేదు. బుండీ బార్ అసోసియేషన్ సభ్యులు కూడా తాము నిందితుల తరపున కోర్టులో వాదించబోమని ప్రకటించారు’’ అని బండి జిల్లా ఎస్పీ జై యాదవ్ చెప్పారు. 

Updated Date - 2022-01-04T16:27:10+05:30 IST