శిశువును ఆసుప‌త్రిలో చేర్పించి...కుటుంబ స‌భ్యులు ప‌రార్‌!

ABN , First Publish Date - 2021-06-22T13:51:30+05:30 IST

రాజస్థాన్‌లోని బుంది జిల్లాలో...

శిశువును ఆసుప‌త్రిలో చేర్పించి...కుటుంబ స‌భ్యులు ప‌రార్‌!

బుంది: రాజస్థాన్‌లోని బుంది జిల్లాలో ఒక నవజాత శిశువును ఆసుపత్రిలో చేర్పించిన కుటుంబ స‌భ్యులు అక్క‌డి నుంచి ప‌రార‌య్యారు. ఆరు రోజులు గ‌డిచిన‌ప్ప‌టికీ ఆ నవజాత శిశువును తీసుకువెళ్లేందుకు ఆసుప‌త్రికి ఎవ‌రూ రాలేదు. దీంతో ప్ర‌స్తుతం ఆసుపత్రి సిబ్బంది ఆ నవజాత శిశువును సంర‌క్షిస్తున్నారు. ఈ ఉదంతంపై ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ శిశువు కుటుంబ సభ్యుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.  పోలీసుల‌కు అందిన ఫిర్యాదు ప్ర‌కారం జూన్ 15న‌ ఆ శిశువును ఇద్దరు మహిళలు ఆసుపత్రికి తీసుకు వ‌చ్చారు. అనారోగ్యంతో శిశువు బాధ‌ప‌డుతున్నాడ‌ని చెప్పి ఆసుప‌త్రిలో చేర్పించారు. ఆ త‌రువాత వారు అదృశ్య‌మ‌య్యారు.

Updated Date - 2021-06-22T13:51:30+05:30 IST