అంబేద్కర్ రాజ్యాంగాన్ని మార్చే శక్తి ఎవరికీ లేదు: సంజయ్

ABN , First Publish Date - 2022-04-14T18:02:14+05:30 IST

అంబేద్కర్ రాజ్యాంగాన్ని మార్చే శక్తి ఎవరికీ లేదని బండి సంజయ్ అన్నారు.

అంబేద్కర్ రాజ్యాంగాన్ని మార్చే శక్తి ఎవరికీ లేదు: సంజయ్

హైదరాబాద్: అంబేద్కర్ రాజ్యాంగాన్ని మార్చే శక్తి ఎవరికీ లేదని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. గురువారం అంబేద్కర్ జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం తిరిగి రాస్తానన్న వ్యక్తులకు చరమగీతం పాడాలన్నారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నేటికీ పూర్తి చేయలేదని ఆరోపించారు. దళిత సీఎం, దళిత బంధు, డబుల్ బెడ్ రూం ఇళ్లు అని.. దళితులను సీఎం కేసీఆర్ మోసం చేశారని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రఘునందన్ రావు, మాజీ ఎంపీ వివేక్, అధికార ప్రతినిధి సంగప్ప తదితర నాయకులు పాల్గొన్నారు.


మాజీ ఎంపీ వివేక్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ దళిత ద్రోహి అని, దళితుడిని సీఎం చేస్తానని దళిత డిప్యూటీ సీఎంలను బర్తరఫ్ చేశారని విమర్శించారు. ఒక్కసారి కూడా అంబేద్కర్ జయంతిలో కేసీఆర్ పాల్గొనలేదని అన్నారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ నిర్మాణాన్ని పూర్తిచేయాలని వివేక్ డిమాండ్ చేశారు.

Updated Date - 2022-04-14T18:02:14+05:30 IST