భవన నిర్మాణ నిబంధనలు ఉల్లంఘిస్తూ, నిర్మించిన ఈ ఇంటిని కూలగొట్టాలని ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయించింది. ఈ ఇల్లు... చుట్టుపక్కల ఉన్న ఇళ్లకు ప్రమాదకరంగా మారుతున్న నేపధ్యంలో కార్పొరేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. ఎంసీడీకి చెందిన ఇంజినీరు ఒకరు మాట్లాడుతూ కొన్ని వార్తల ద్వారా తాము ఆ ఇంటి గురించి తెలుసుకున్నామని, నియమ, నిబంధనలను ఉల్లంఘించి దానిని నిర్మించారన్నారు. ఇంటి నిర్మాణానికి కనీసం 32 చదరపు అడుగుల స్థలం అవసరముంటుందని అన్నారు. అయితే ఈ ఇంటిని అక్రమంగా కేవలం ఆరు అడుగుల స్థలంలో నిర్మించారని అన్నారు. ఇటువంటి ఇళ్లకు ఎప్పటికీ అనుమతి లభించదని పేర్కొన్నారు. ఈ ఇంటి గురించి చాలామంది తమకు ఫిర్యాదు చేశారని, దీనిని త్వరలోనే కూలగొట్టనున్నామని తెలిపారు.