Union Minister Nitin Gadkari: బ్యూరోక్రాట్స్‌పై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-08-10T17:43:32+05:30 IST

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ(Union Minister Nitin Gadkari) బ్యూరోక్రాట్స్‌పై(Bureaucrats) తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు....

Union Minister Nitin Gadkari: బ్యూరోక్రాట్స్‌పై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు

నాగపూర్(మహారాష్ట్ర): కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ(Union Minister Nitin Gadkari) బ్యూరోక్రాట్స్‌పై(Bureaucrats) తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారులు మంత్రులు చెప్పినట్లు ప్రభుత్వ పనులు చేయాలని కేంద్రమంత్రి సూచించారు. ‘‘ప్రభుత్వంలోని మంత్రులు చెప్పిన దానికి అధికారులు ఎస్ సార్ చెప్పాలని(only say yes sir to ministers) నేను అధికారులకు ఎల్లప్పుడూ చెబుతుంటాను, ఏదైనా మంత్రులు చెప్పిందే బ్యూరోక్రాట్లు చేయాలి’’ అని నాగపూర్ నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో గడ్కరీ(Nitin Gadkari) చెప్పారు. పేద ప్రజల సంక్షేమం విషయంలో మహాత్మాగాంధీ చెప్పిన కొటేషన్ ను(quoted Mahatma Gandhi) మంత్రి గడ్కరీ గుర్తు చేశారు.


 ‘‘ఏ చట్టాన్ని అయినా 10 సార్లు ఉల్లంఘించ వలసి వచ్చినా వెనుకాడకూడదు,పేదల సంక్షేమానికి ఏ చట్టం అడ్డురాదని నాకు తెలుసు’’ అని మహాత్మా గాంధీ చెప్పిన కొటేషన్ ను కేంద్రమంత్రి కోట్ చేశారు. అటవీ చట్టాల వల్ల మహారాష్ట్రలోని గడచిరోలీ, మెల్ ఘాట్ ప్రాంత అటవీ గ్రామాల్లో రోడ్లను నిర్మించలేక పోయామని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. రోడ్లు లేక 1995 సంవత్సర కాలంలో వేలాదిమంది గిరిజన విద్యార్థులు పోషకాహార లోపంతో మరణించారని నితిన్ గడ్కరీ ఆవేదన వ్యక్తం చేశారు. పేదల సంక్షేమం కోసం అటవీ చట్టాలను ఉల్లంఘించి అయినా రోడ్లను అభివృద్ధి చేయాలని మంత్రి గడ్కరీ వివరించారు.




Updated Date - 2022-08-10T17:43:32+05:30 IST