ఎన్‌ఆర్‌ఐ బంగళాలో దారుణం.. అర్ధరాత్రి కిటికీ అద్దాలు పగలగొట్టి..

ABN , First Publish Date - 2021-10-23T22:20:58+05:30 IST

ఓ ఎన్‌ఆర్ఐకి చెందిన బంగళాలో దొంగతనానికి పాల్పడ్డ దుండగులు.. అక్కడే నివసించే ఓ ముసలి సెక్యురిటీ గార్డును దారుణంగా హత్య చేశారు. గుజరాత్‌లోని ఆనంద్ జిల్లాలో సెప్టెంబర్ మొదటి వారంలో ఈ హత్య జరగ్గా..స్థానిక పోలీసులు ఇటీవలే నిందితులను అరెస్టు చేశారు.

ఎన్‌ఆర్‌ఐ బంగళాలో దారుణం.. అర్ధరాత్రి కిటికీ అద్దాలు పగలగొట్టి..

ఇంటర్నెట్ డెస్క్: ఓ ఎన్‌ఆర్ఐకి చెందిన బంగళాలో దొంగతనానికి పాల్పడ్డ దుండగులు.. అక్కడే నివసించే ఓ ముసలి సెక్యురిటీ గార్డును దారుణంగా హత్య చేశారు. గుజరాత్‌లోని ఆనంద్ జిల్లాలో సెప్టెంబర్ మొదటి వారంలో ఈ హత్య జరగ్గా..స్థానిక పోలీసులు ఇటీవలే నిందితులను అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఠాకూర్ పటేల్‌ అనే ఎన్‌ఆర్ఐకి చెందిన ఓ భవంతిలోకి నిందితులు చొరబడి లూటీకి పాల్పడ్డారు. అదే ఇంట్లో ఉంటూ భవంతిని కనిపెట్టుకుని ఉండే రామ్తూ భోయిని(65) కూడా వారు పొట్టనపెట్టుకున్నారు. 


‘‘నేరం జరిగిన ప్రదేశాన్ని పరిశీలిస్తే.. నిందితులు కిటికీ అద్దాలు పగలగొట్టుకుని లోపలికి చొరబడినట్టు స్పష్టమవుతోంది’’ అని డీఎస్పీ ఆర్ ఎల్ సోలంకీ తెలిపారు. ఆయన నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందమే ఈ కేసును ఇటీవల ఛేదించింది. ‘‘మొత్తం 150 మంది అనుమానితుల్ని ప్రశ్నించాం. అందులో ఒకరు మరో నలుగురితో కలిసి ఈ నేరానికి పాల్పడినట్టు అంగీకరించాడు’’ అని సోలంకీ తెలిపారు.


ఈ క్రమంలో పోలీసులు..విక్రమ్ తల్పాడే, గోపాల్ తల్పాడా, భూరా తల్పాడా, సంజయ్ తల్పాడా, జీనా తల్పాడా అనే ఐదుగురు నిందితులపై కేసు నమోదు చేశారు. వీరందరూ భోర్సాద్ తాలూకాలోని దేవ్హాన్ గ్రామానికి చెందిన వారని తెలిపారు. ఐదుగురిలో ముగ్గురు పట్టుబడగా.. గోపాల్, భూరా మాత్రం ప్రస్తుతం పరారీలో ఉన్నారు. నిందితులు తొలుత ఆ ప్రాంతంలో రెక్కీ నిర్వహించారని సోలంకీ తెలిపారు. బంగళాలోకి చొరబడిన సమయంలో అక్కడే ఉన్న రామ్తూ తమను అడ్డుకోవడంతో అతడి గొంతు నులిమి హత్య చేశామని నిందితులు అంగీకరించినట్టు పేర్కొన్నారు. 

Updated Date - 2021-10-23T22:20:58+05:30 IST