తాళాలు వేసి ఉన్న రెండు ఇళ్లలో చోరీలు
ABN , First Publish Date - 2022-07-03T05:35:49+05:30 IST
అద్దంకి పట్టణంలో తాళాలు వేసి ఉన్న రెండు ఇళ్లలో శుక్రవారం రాత్రి చోరీలు జరిగాయి.
ఆందోళన చెందుతున్న అద్దంకి పట్టణ ప్రజలు
అద్దంకి, జూలై 2: అద్దంకి పట్టణంలో తాళాలు వేసి ఉన్న రెండు ఇళ్లలో శుక్రవారం రాత్రి చోరీలు జరిగాయి. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. పట్టణంలోని విశ్వభారతి స్కూల్ సమీ పంలోని కాకతీయనగర్లో కలవకూరి ఆంజనేయులు కుటుంబస భ్యులు శుక్రవారం బాపట్లలో ఉన్న కుమార్తె వద్దకు వెళ్ళారు. శని వారం రాత్రి ఇంటికి వచ్చి చూడగా చోరీ జరిగినట్లు గుర్తించారు. ఇంట్లో బీరువా పగులగొట్టి అందులో ఉన్న మూడు చి న్న పిల్లల ఉంగరాలు, 200 గ్రాముల వెండి వస్తువులు, రూ.8 వేల నగదు అపహరించు కుపోయినట్లు గుర్తించారు. సంఘటనా స్థలాన్ని ఎస్సై కమలాకర్ పరిశీలించారు. ఆంజనేయులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
మరో ఘటనలో అభ్యుదయనగర్లోని అపార్టుమెంట్ సమీపంలో చల్లగుండ్ల హరిబాబు నూతనంగా కట్టుకున్న ఇంట్లో ఇటీవల గృహ ప్రవేశం చేశారు. కుటుంబసభ్యులతో కలిసి శుక్రవారం తిరుమల వెళ్ళారు. శనివారం ఇంటి తలుపులు తీసి ఉండటంతో సమీప గృహాల వారు చోరీ జరిగినట్లు గుర్తించి హరిబాబుకు సమాచారం అందించారు. తిరుమల నుంచి శనివారం రాత్రికి రాకపో వటంతో ఇంట్లోకి ఎవరు వెళ్ళలేదు. దీంతో ఏమి చోరీ జరిగింది వెల్లడి కాలేదు.
నాలుగు రోజుల క్రితం వృద్ధ దంపతులపై దాడిచేసి బంగారం అపహరించుకుపోవటం మరిచిపోక ముందే మరలా రెండు ఇళ్లలో చోరీలు జరిగాయి. వరుస సంఘటనలతో పట్టణ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.