శ్మశాన తిప్పలు

ABN , First Publish Date - 2022-08-09T06:37:56+05:30 IST

స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచింది. ప్రభుత్వాలు మారుతూనే ఉన్నాయి. పాలకులు వస్తున్నారు. పోతున్నారు.

శ్మశాన తిప్పలు
ఎంఎంసీ కండ్రిగలో శ్మశానానికి దారి లేక అవస్థలు

శ్రీకాళహస్తి, ఆగస్టు 8: స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచింది. ప్రభుత్వాలు మారుతూనే ఉన్నాయి. పాలకులు వస్తున్నారు. పోతున్నారు. కానీ గ్రామస్థాయిలో నేటికీ దుర్భర పరిస్థితులు దర్శనమిస్తూనే ఉన్నాయి. చాలాచోట్ల స్మశానాలకు దారిలేకపోవడంతో మనిషి చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నకుటుంబసభ్యులకు అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు అంతకు రెట్టించిన తిప్పలు తప్పడంలేదు. శ్రీకాళహస్తి మండలం మర్రిమాకుల చేనుకండ్రిగలో కనిపించిన దృశ్యమిదీ. ఈ గ్రామం నుంచి శ్మశానానికి దారి లేదు.  సోమవారం గ్రామానికి చెందిన రవి అనే వ్యక్తి మరణించాడు.  శ్మశానానికి దారిలేక రెండు కిలోమీటర్లు వరి పొలాల్లో శవాన్ని తీసుకెళ్లాల్సి వచ్చింది.  

Updated Date - 2022-08-09T06:37:56+05:30 IST