ఓ ఇంట్లోంచి పొగలు.. పక్కింటి వాళ్లు అనుమానంతో వెళ్లి చూస్తే నట్టింట్లో పరుపులు, దుస్తుల కుప్పలోంచి మంటలు.. దాని కింద..

ABN , First Publish Date - 2021-10-22T02:30:09+05:30 IST

బనశంకరి సమీపంలో యారబ్‌నగర్ 16వ క్రాస్‌‌లో అఫ్రినా ఖానం, లాలూఖాన్ అనే దంపతులు‌.. ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు. భర్త టింబర్ డిపోలో పని చేస్తుంటాడు. అన్యోన్యంగా సాగుతున్న వీరి కుటుంబంలో ఇటీవల తరచూ గొడవలు జరుగుతుండేవి.

ఓ ఇంట్లోంచి పొగలు.. పక్కింటి వాళ్లు అనుమానంతో వెళ్లి చూస్తే నట్టింట్లో పరుపులు, దుస్తుల కుప్పలోంచి మంటలు.. దాని కింద..

ఓ ఇంట్లో భార్యాభర్తలు.. ముగ్గురు పిల్లలతో కలిసి ఉంటున్నారు. రోజూ మాదిరే భర్త.. పొద్దునే పనికి వెళ్లాడు. తర్వాత కొద్దిసేపటికి ఉన్నట్టుండి ఇంటి నుంచి మంటలు, పొగ రావడం మొదలైంది. స్థానికులు కంగారుగా అక్కడికి చేరుకున్నారు. తీరా వచ్చి చూసి షాక్ అయ్యారు. కుప్పగా ఉన్న దుస్తులన్నీ తగలబడడం కనిపించింది. సంచలనం కలిగించిన ఈ ఘటన.. వివరాల్లోకి వెళితే..


కర్ణాటక బనశంకరి సమీపంలో యారబ్‌నగర్ 16వ క్రాస్‌‌లో అఫ్రినా ఖానం, లాలూఖాన్ అనే దంపతులు‌.. ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు. భర్త టింబర్ డిపోలో పని చేస్తుంటాడు. అన్యోన్యంగా సాగుతున్న వీరి కుటుంబంలో ఇటీవల తరచూ గొడవలు జరుగుతుండేవి. భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న భర్త తరచూ గొడవపడేవాడు. ఈ క్రమంలో ఇటీవల పిల్లలందరినీ పుట్టింటికి పంపించింది. మంగళవారం మళ్లీ అదే విషయమై ఘర్షణ జరిగింది. అనంతరం భర్త పనికి వెళ్లిపోయాడు.


భర్త పనికి వెళ్లిన కొద్దిసేపటికి.. ఓ వ్యక్తి ఇంట్లోకి వెళ్లాడు. అఫ్రినా ఖానంతో గొడవపడ్డాడు. ఈ క్రమంలో ఆ వ్యక్తి కత్తెర తీసుకుని ఆమెపై దాడి చేశాడు. తీవ్రగాయాలవడంతో అక్కడికక్కడే చనిపోయింది. అనంతరం మృతదేహంపై బట్టలన్నింటినీ కుప్పగా పోసి నిప్పు పెట్టి వెళ్లిపోయాడు. కొద్దిసేపటికి మంటలు చెలరేగడంతో స్థానికులు గమనించారు. మృతురాలి భర్త, బంధువులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న వారు తలుపులు బద్దలుకొట్టి లోపలికి వెళ్లి చూడగా.. మృతదేహంపై పరుపు, బట్టలన్నీ కాలిపోవడం కనిపించింది. సమాచారం అందుకున్న బనశంకరి పోలీసులు.. అక్కడికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-10-22T02:30:09+05:30 IST