ఇస్కాన్లో రావణాసురుడి ప్రతిమ దహనం
ABN , First Publish Date - 2021-10-17T06:19:19+05:30 IST
విజయదశమి పర్వదినం సందర్భంగా శుక్రవారం రాత్రి రావణాసురుడి ప్రతిమ దహనం కార్యక్రమాన్ని సాగర్నగర్ ఇస్కాన్ మందిర ప్రాంగణంలో వైభవంగా నిర్వహించారు.
సాగర్నగర్, అక్టోబరు 16: విజయదశమి పర్వదినం సందర్భంగా శుక్రవారం రాత్రి రావణాసురుడి ప్రతిమ దహనం కార్యక్రమాన్ని సాగర్నగర్ ఇస్కాన్ మందిర ప్రాంగణంలో వైభవంగా నిర్వహించారు. సుమారు 50 అడుగుల భారీ రావణుడి ప్రతిమను ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్, ఇస్కాన్ అధ్యక్షుడు సాంబదాస్ చేతులమీదుగా దహనం చేశారు. అనంతరం నిర్వహించిన ఫైర్ క్రాకర్స్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు, రామలీలపై ప్రవచనలు భక్తులను అలరించాయి. భక్తులకు ప్రసాద వితరణ చేశారు.