టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు పుస్తకాలు దహనం
ABN , First Publish Date - 2021-02-28T04:17:50+05:30 IST
పార్టీలో తమను గుర్తించడం లే దని నాయకులు ఎవరూ పట్టించుకోవడం లేదని నిరసన వ్యక్తం చేస్తూ..
వెల్దండ, ఫిబ్రవరి 27: పార్టీలో తమను గుర్తించడం లే దని నాయకులు ఎవరూ పట్టించుకోవడం లేదని నిరసన వ్యక్తం చేస్తూ వెల్దండ మండలం కుప్పగండ్ల గ్రామంలో శనివారం రాత్రి టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు పుస్తకాలను ఆ పార్టీ నాయకులే దహనం చేశారు. పార్టీలో తమకు గుర్తింపు కొరబడిందని, సభ్యత్వ నమోదు ఎందుకు చే యించాలని నాయకులు ఆరోపించారు. కార్యక్రమంలో స్థానిక పార్టీ అధ్యక్షుడు రవి ఉన్నారు.