బుర్సన్‌పటర్‌ అటవీ ప్రాంతంలో కార్చిచ్చు

ABN , First Publish Date - 2021-02-28T05:33:30+05:30 IST

మండలంలోని బుర్సన్‌పటర్‌ గ్రామం సమీపంలోని అటవీ ప్రాంతంలో శనివారం మధ్యాహ్నం కార్చిచ్చు మంటలు ఏర్పడడంతో బుర్సన్‌పటర్‌ గ్రామస్థులు ఆందోళనకు గురయ్యారు.

బుర్సన్‌పటర్‌ అటవీ ప్రాంతంలో కార్చిచ్చు
అటవీ ప్రాంతంలో మంటలను ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది

ఆందోళనకు గురైన గ్రామస్థులు

ఇంద్రవెల్లి, ఫిబ్రవరి27: మండలంలోని బుర్సన్‌పటర్‌ గ్రామం సమీపంలోని అటవీ ప్రాంతంలో శనివారం మధ్యాహ్నం కార్చిచ్చు మంటలు ఏర్పడడంతో బుర్సన్‌పటర్‌ గ్రామస్థులు ఆందోళనకు గురయ్యారు. అడవిలో ఏర్పడిన కార్చిచ్చు కాలుతూ గ్రామ సమీపానికి చేరడంతో అప్రమత్తమైన గ్రామస్థులు వెంటనే ఫైర్‌ అధికారులకు సమాచారం అందించారు. గ్రామానికి చేరుకున్న ఫైర్‌ అధికారులు, సిబ్బంది మంటలను అదుపు చేశారు. గ్రామంలో నీటి సమస్య అధికంగా ఉందని, వేసవిలో ఎలాంటి అగ్నిప్రమాదం జరిగినా అదుపు చేయడం సాధ్యం కాదని గ్రామస్థులు చంద్రకాంత్‌, సంతోష్‌ వాపోయారు.

Updated Date - 2021-02-28T05:33:30+05:30 IST