వాసవీ శాంతి ధాంలో హోమాలు
ABN , First Publish Date - 2021-07-24T05:50:53+05:30 IST
పెనుగొండ వాసవీ శాంతి ధామ్ ప్రాంగణంలో గురుపూ ర్ణిమ మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించా రు.
పెనుగొండ, జూలై 23: పెనుగొండ వాసవీ శాంతి ధామ్ ప్రాంగణంలో గురుపూ ర్ణిమ మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించా రు. వాసవి మాతకు ఉదయం సువర్ణ, రజ త పుష్పార్చన చేశారు. సాయంత్రం రుద్ర, దుర్గ సప్తశతి హోమాలు నిర్వహించారు. తెప్పోత్సవం, అష్టభుజ పుష్కరిణిలో దీపోత్సవం జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.