నాగేశ్వరరావు మృతి కళా రంగానికి తీరని లోటు
ABN , First Publish Date - 2021-04-17T06:04:23+05:30 IST
సాంస్కృతిక దిగ్గజం వైకే నాగేశ్వరరావు మృతి కళా రంగానికి తీరని లోటని ప్రముఖ సినీ రచయిత బుర్రా సాయిమాధవ్ అన్నారు.
తెనాలి అర్బన్, ఏప్రిల్ 16 : సాంస్కృతిక దిగ్గజం వైకే నాగేశ్వరరావు మృతి కళా రంగానికి తీరని లోటని ప్రముఖ సినీ రచయిత బుర్రా సాయిమాధవ్ అన్నారు. స్థానిక సీపీఐ కార్యాలయంలో సాహిత్య సంస్థ కళల కాణాచి ఆధ్వర్యంలో సంతాపసభ నిర్వహించారు. వైకే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రధాన కార్యదర్శి షేక్ జానీబాషా మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రాల్లో సాంస్కృతిక కార్యక్రమాలను విరివిగా నిర్వహించే వారిలో వైకే ఒకరని ఆయన మృతి కళారంగానికి తీరని లోటన్నారు. చెరుకుమల్లి సింగారావు, గోపరాజు విజయ్, సత్యనారాయణ, సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.