జగన్ హయాంలో శ్మశాన వాటికలూ హౌస్ఫుల్ : నిమ్మల
ABN , First Publish Date - 2021-05-11T06:15:54+05:30 IST
పట్టణంలో సోమవారం ఉదయం ఒక వ్యక్తి కరోనాతో మరణించ డంతో పట్టణ సీఐ ఆంజనేయులు కరోనా నిబంధనలతో అంత్యక్రియలు జరిపించారు.
పాలకొల్లు టౌన్, మే 10 : పట్టణంలో సోమవారం ఉదయం ఒక వ్యక్తి కరోనాతో మరణించ డంతో పట్టణ సీఐ ఆంజనేయులు కరోనా నిబంధనలతో అంత్యక్రియలు జరిపించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రామానాయుడు హిందూ శ్మశాన వాటిక వద్దకు వచ్చి అంత్యక్రియలు జరిపిన ప్రాంతాన్ని పరిశీలించి, శానిటేషన్ చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం జగన్ పాలనలో కోవిడ్ ఆసుపత్రులే కాదు, శ్మశాన వాటికల వద్ద కూడా హౌస్ఫుల్ బోర్డులు పెడుతున్నారని, బెడ్లు, ఆక్సిజన్, ఐసీయూ, వెంటిలేటర్లు, రెమిడెసివిర్ మందులు లేక ప్రజలు రోడ్డుమీదే ప్రాణాలను వదిలివేసే దుస్థితి ఏర్పడిందన్నారు.