జగన్‌ హయాంలో శ్మశాన వాటికలూ హౌస్‌ఫుల్‌ : నిమ్మల

ABN , First Publish Date - 2021-05-11T06:15:54+05:30 IST

పట్టణంలో సోమవారం ఉదయం ఒక వ్యక్తి కరోనాతో మరణించ డంతో పట్టణ సీఐ ఆంజనేయులు కరోనా నిబంధనలతో అంత్యక్రియలు జరిపించారు.

జగన్‌ హయాంలో శ్మశాన వాటికలూ హౌస్‌ఫుల్‌ : నిమ్మల

పాలకొల్లు టౌన్‌, మే 10 : పట్టణంలో సోమవారం ఉదయం ఒక వ్యక్తి కరోనాతో మరణించ డంతో  పట్టణ సీఐ  ఆంజనేయులు కరోనా నిబంధనలతో  అంత్యక్రియలు జరిపించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రామానాయుడు  హిందూ శ్మశాన వాటిక వద్దకు వచ్చి  అంత్యక్రియలు జరిపిన ప్రాంతాన్ని పరిశీలించి, శానిటేషన్‌ చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ సీఎం జగన్‌ పాలనలో కోవిడ్‌ ఆసుపత్రులే కాదు, శ్మశాన వాటికల వద్ద కూడా హౌస్‌ఫుల్‌ బోర్డులు పెడుతున్నారని, బెడ్లు, ఆక్సిజన్‌, ఐసీయూ, వెంటిలేటర్లు, రెమిడెసివిర్‌ మందులు లేక ప్రజలు రోడ్డుమీదే ప్రాణాలను వదిలివేసే దుస్థితి ఏర్పడిందన్నారు. 


Updated Date - 2021-05-11T06:15:54+05:30 IST