పెళ్లిబస్సు బోల్తా

ABN , First Publish Date - 2022-05-21T06:20:39+05:30 IST

కాకినాడ జిల్లా గండేపల్లి మండలం నీలాద్రిపేట గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున పెళ్లి బృందంతో వెళుతున్న బస్సు అదుపుతప్పి పెట్రోల్‌ బంకు ఎదురుగా బోల్తాపడింది.

పెళ్లిబస్సు బోల్తా

ఒకరి మృతి
గండేపల్లి, మే 20: కాకినాడ జిల్లా గండేపల్లి మండలం నీలాద్రిపేట గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున పెళ్లి బృందంతో వెళుతున్న బస్సు అదుపుతప్పి పెట్రోల్‌ బంకు ఎదురుగా బోల్తాపడింది. ఈ సంఘటనలో ఒకరు మృతిచెందగా, 36 మందికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... శుక్రవారం రాత్రి జరిగే పెళ్లికి విజయనగరం నుంచి ఏలూరుకు పెళ్లికొడుకుతో సహా వెళ్తున్నారు. బస్సులో మొత్తం 37 మంది ఉన్నారు.  బస్సు గండేపల్లి మండలం నీలాద్రిపేట వచ్చేసరికి గ్రామ శివారు పెట్రోల్‌ బంకు సమీపంలో అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్నవారందరూ మీద పడడంతో పెళ్లికొడుక్కి వరుసకు పెదనాన్న అయ్యే గూడిపాటి వెంకట కోదండ రామయ్య (72) ఊపిరాడక మృతిచెందాడు.  మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను రాజానగరం జీఎ్‌సఎల్‌కు తరలించా రు. జగ్గంపేట సీఐ సూర్యఅప్పారావు, గండేపల్లి ఎస్‌ఐ గణే్‌షకుమార్‌ సంఘటన స్థలాన్ని పరిశీలించి ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. దీనిపై ఎస్‌ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-05-21T06:20:39+05:30 IST