AP News: నంద్యాల: వ్యక్తి పైకి దూసుకుపోయిన ఆర్టీసీ బస్సు

ABN , First Publish Date - 2022-08-05T13:57:37+05:30 IST

శ్రీశైలం మండలం సున్నిపెంట ఆర్టీసి బస్టాండ్‌లో ఓ వ్యక్తిపైకి రాజమండ్రి ఆర్టీసీ డిపో బస్సు దూసుకుపోయింది.

AP News: నంద్యాల: వ్యక్తి పైకి దూసుకుపోయిన ఆర్టీసీ బస్సు

నంద్యాల (Nandyala): శ్రీశైలం మండలం సున్నిపెంట ఆర్టీసి బస్టాండ్‌లో ఓ వ్యక్తిపైకి రాజమండ్రి ఆర్టీసీ డిపో బస్సు దూసుకుపోయింది. ఈ ఘటనలో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. తలపైకి బస్సు టైర్ ఎక్కడంతో మృతుని తల నుజ్జు నుజ్జు అయింది. మృతుడు సున్నిపెంటకు చెందిన పరిసెపోగు ఏసు (45)గా గుర్తించారు. సమాచారం అందుకున్న శ్రీశైలం టూటౌన్ పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేసిన అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెప్పారు.

Updated Date - 2022-08-05T13:57:37+05:30 IST