లారీని ఢీకొన్న బస్సు

ABN , First Publish Date - 2022-05-16T05:34:46+05:30 IST

వేగంగా వెళుతున్న బస్సు ముందులారీని ఓవర్‌ టేక్‌ చేయబోయి లారీని ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది

లారీని ఢీకొన్న బస్సు
ప్రమాదానికి గురైన బస్సు

ఆరుగురికి గాయాలు

పెదవేగి/ ఏలూరు క్రైం, మే 15 : వేగంగా వెళుతున్న బస్సు ముందులారీని ఓవర్‌ టేక్‌ చేయబోయి లారీని ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది ఈ ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు తీవ్రగాయాలకు గురయ్యారు. తెలంగాణ రాష్ట్రం మెదక్‌ డిపోకు చెందిన బస్సు అమలాపురం నుంచి ఈనెల 14వ తేదీ రాత్రి బయలుదేరింది. ఏలూరు సమీప ంలో అమ్మపాలెం అడ్డరోడ్డు వద్ద ఆదివారం తెల్లవారు జామును 4.30 గంటల ప్రాంతంలో ముందు వెళుతున్న లారీని ఓవర్‌టేక్‌ చేసే సమయంలో ఆ లారీ సడన్‌బ్రేక్‌ వేయడంతో బస్సు ఎడమ భాగం లారీకి తగిలి నుజ్జు అయింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవరు ఎం.మొహీద్దీన్‌, అమలాపురం మండలం అల్లవరానికి చెందిన కొప్పాడి పద్మా వతి, అమలాపురం మండలం కామనగరువుకు చెందిన  రాజలపూడి అమితేష్‌, కొప్పాడి ఆదినారాయణలు తీవ్రగా యాలు పాలయ్యారు. వీరిని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చారు. మరో ఇద్దరిని ఏలూరులోని ప్రైవేటు ఆసు పత్రికి తరలించారు. ఆసుపత్రి వైద్యులు ఎమ్మెల్సీగా నమోదు చేసి పోలీసులకు సమాచారం ఇచ్చా రు. పెదవేగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2022-05-16T05:34:46+05:30 IST