ఆగిన బస్సును ఢీకొట్టిన కారు

ABN , First Publish Date - 2021-03-09T07:04:17+05:30 IST

భీమడోలు హైవేపై ఆగి ఉన్న బస్సును క్వాలిస్‌ వాహనం ఢీ కొట్టిన ప్రమాదంలో మొత్తం 9 మందికి గాయాలయ్యాయి.

ఆగిన బస్సును ఢీకొట్టిన కారు

9 మందికి గాయాలు

ఆస్పత్రులకు తరలింపు 

భీమడోలు, మార్చి 8 :భీమడోలు హైవేపై ఆగి ఉన్న బస్సును క్వాలిస్‌ వాహనం ఢీ కొట్టిన ప్రమాదంలో మొత్తం 9 మందికి గాయాలయ్యాయి.  భీమడోలు ఎస్‌ఐ శ్రీహరిరావు తెలిపిన వివరాలు.. రాజమండ్రి నుంచి విజయవాడకు తొమ్మిది మందితో ప్రయాణిస్తున్న క్వాలిస్‌ వాహనం భీమడోలు రైల్వే స్టేషన్‌ సమీపంలోని బస్టాండ్‌ వద్ద ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి ఢీ కొట్టింది. ప్రమాదంలో ఐదేళ్ల బాలుడితో పాటు మొత్తం 9 మందికి గాయాలైన ఘటనలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యా యన్నారు. మల్లంపాటి కిషోర్‌, తుమ్మాటి లక్ష్మణరావు, భావినేని సుమన్‌, దుసులా దేవి, ఎన్‌.సౌజన్య, ఎ.జాన్‌, ఎ.మాధ వి, ఎం.రుత్విక్‌ ఉన్నారు. వీరిలో భావినేని సుమన్‌కు తీవ్ర గాయాలు కాగా, కొంతమందిని ఏలూరు ఆశ్రం ఆసుపత్రికి, మరికొందరిని ఏ లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు. 

Updated Date - 2021-03-09T07:04:17+05:30 IST