ఉక్రేనియన్లతో వెళ్తున్న బస్సు ఇటలీలో బోల్తా
ABN , First Publish Date - 2022-03-13T21:41:37+05:30 IST
రష్యా దురాక్రమణ నేపథ్యంలో లక్షలాదిమంది పౌరులు ప్రాణాలు అరచేతలో పెట్టుకుని ఉక్రెయిన్ను వీడి పొరుగుదేశాలకు..
రోమ్: రష్యా దురాక్రమణ నేపథ్యంలో లక్షలాదిమంది పౌరులు ప్రాణాలు అరచేతలో పెట్టుకుని ఉక్రెయిన్ను వీడి పొరుగుదేశాలకు వెళ్లిపోతున్నారు. ఇప్పటికే 20 లక్షల మందికిపైగా ఉక్రెయిన్ను వీడినట్టు ఐక్యరాజ్య సమితి ఇటీవల వెల్లడించింది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ప్రతి రోజూ వలసలు కొనసాగుతూనే ఉన్నాయి.
తాజాగా 50 మంది ఉక్రేనియన్లతో వెళ్తున్న బస్సు ఇటలీలో బోల్తా పడింది. సెసెనా-రిమిని మధ్య హైవేపై ఈ ఘటన జరిగినట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.