ఆర్టీసీ బస్సు-లారీ ఢీ
ABN , First Publish Date - 2022-07-01T06:28:37+05:30 IST
చింతూరు మండలం మోతుగూడెం పరిధిలోని సుకుమామిడి రెండో మలుపులో శుక్రవారం సీలేరు నుంచి విజయవాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సు, లారీ ఎదురెదురుగా ఢీకొ న్నాయి.
లారీ డ్రైవర్ మృతి
మోతుగూడెం, జూన్ 30: చింతూరు మండలం మోతుగూడెం పరిధిలోని సుకుమామిడి రెండో మలుపులో శుక్రవారం సీలేరు నుంచి విజయవాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సు, లారీ ఎదురెదురుగా ఢీకొ న్నాయి. ఈ ప్రమాదంలో విజయవాడకు చెందిన లారీ డ్రైవర్ పల్లపు రాజు అక్కడికక్కడే మృతిచెందాడు. వై.రామవరం మండలం బొడ్డగండి పంచాయతీ నవగూడ గ్రామంలో ఉపాద్యాయురాలిగా పనిచేస్తున్న మిరియాల దివ్య, చింతూరు మండలం ఇంతులూరు గ్రామంలో పనిచేస్తున్న మరో ఉపా ధ్యాయురాలు నాగలక్ష్మి, ఆర్టీసీ బస్సు డ్రైవర్ తీవ్ర గాయాలపాలయ్యారు. బస్సులోని మిగిలిన 16 మందికి గాయా లయ్యాయి. క్షతగాత్రులను భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తర లించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.