రేపటి నుంచి విద్యార్థులకు బస్పాస్లు
ABN , First Publish Date - 2021-07-27T05:22:14+05:30 IST
నిర్ణీత రూట్లలో విద్యార్థులకు ఈ నెల 28 నుంచి బస్ పాస్లను జారీ చేస్తున్నట్లు ఆర్టీసీ ఆర్ఎం అప్పలరాజు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.
రింగురోడ్డు : నిర్ణీత రూట్లలో విద్యార్థులకు ఈ నెల 28 నుంచి బస్ పాస్లను జారీ చేస్తున్నట్లు ఆర్టీసీ ఆర్ఎం అప్పలరాజు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. విజయనగరం బస్స్టేషన్లోని కౌంటర్లలో పాస్లు జారీచేస్తా మని విజయనగరం నుంచి అనకాపల్లి, బొబ్బిలి, రాజాం, ఎస్.కోట, జక్కువ రూట్లలో మాత్రమే పాస్ మంజూరు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. హైర్ బస్సులకు అనుమతి లభించగానే మిగతా రూట్లలో కూడా పాస్లు జారీ చేస్తా మని పేర్కొన్నారు. విద్యార్థులు, ప్రయాణికులు విధిగా మాస్క్లు ధరించాలని సూచించారు.