అదుపుతప్పి చెట్టును ఢీకొన్న పాఠశాల బస్సు
ABN , First Publish Date - 2022-05-07T15:46:32+05:30 IST
విరుదునగర్ జిల్లా సాతూర్ సమీపం ఒ.మేట్టుపట్టి తిరువేంగడం నుంచి సాతూర్కు వస్తున్న ఓ ప్రైవేటు పాఠశాల బస్సు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో 21 మంది విద్యార్థులకు
21 మంది విద్యార్థులకు గాయాలు
పెరంబూర్(చెన్నై): విరుదునగర్ జిల్లా సాతూర్ సమీపం ఒ.మేట్టుపట్టి తిరువేంగడం నుంచి సాతూర్కు వస్తున్న ఓ ప్రైవేటు పాఠశాల బస్సు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో 21 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు.. తిరువేంగడం, కరిసల్కుళం ప్రాంతాల నుంచి సుమారు 60 మంది విద్యార్థులతో శుక్రవారం ఉదయం పాఠశాల బస్సు సాతూర్కు బయల్దేరింది. తిరువేంగడంకు చెందిన గణపతి (63) డ్రైవర్. బస్సు మేట్టుపట్టి సమీపంలో వస్తుండగా అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న వేప చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో గాయపడిన 21 మంది విద్యార్థులను స్థానికులు అంబులెన్స్లో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారు. తీవ్రంగా గాయపడిన ఆరుగురు విద్యార్థులను మదురై ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఐసీయూలో ఉంచి చికిత్సలు అందిస్తున్నారు. సాతూర్ తాలూకా పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.