రద్దు చేసిన సర్వీ్‌సలను వెంటనే పునరుద్ధించాలి

ABN , First Publish Date - 2021-03-08T06:09:19+05:30 IST

అద్దంకి డిపోలో ఆదాయం తక్కువగా వస్తుందని రద్దు చేసిన 6 సర్వీ్‌సలను వెంటనే పునరుద్ధరించి ప్రయాణికులకు ఇబ్బంది లే కుండా చూడాలని ఏపీపీటీడీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ కార్యదర్శి పి.చిరంజీవి, కె.రాంబాబు డిమాండ్‌ చేశారు.

రద్దు చేసిన సర్వీ్‌సలను వెంటనే పునరుద్ధించాలి
ఆర్టీసీ గ్యారేజి ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న ఏపీపీటీడీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ , కార్మిక పరిషత్‌ కార్మికులు

అద్దంకిటౌన్‌, మార్చి 7: అద్దంకి డిపోలో ఆదాయం తక్కువగా వస్తుందని రద్దు చేసిన 6 సర్వీ్‌సలను వెంటనే పునరుద్ధరించి ప్రయాణికులకు ఇబ్బంది లే కుండా చూడాలని ఏపీపీటీడీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ కార్యదర్శి పి.చిరంజీవి, కె.రాంబాబు డిమాండ్‌ చేశారు. ఆదివారం అద్దంకి  ఆర్టీసీ గ్యారేజి ఎదుట  ఏపీపీటీడీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ , కార్మిక పరిషత్‌ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు  సర్వీసుల మార్పులు, చేర్పుల సమయంలోను ఉద్యోగ సంఘాలతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలన్నారు. అద్దంకి డిపోలో అక్రమంగా సస్పెండ్‌ చేసిన డ్రైవర్లను వెంటనే విధులకు హాజరు అయ్యేలా ఉత్తర్వులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సంఘాల నాయకులు కె.హనుమంతరావు, సుబ్బరామయ్య, పి.ఏడుకొండలు, కె. శ్రీనివాసరావు, కార్మికులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-03-08T06:09:19+05:30 IST