BV Raghavulu: విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం ఇప్పుడు మరో ఎత్తు గడ..

ABN , First Publish Date - 2022-08-12T18:05:25+05:30 IST

స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం ఇప్పుడు మరో ఎత్తు గడ వేసిందని సీపీఎం నేత బీవీ రాఘవులు అన్నారు.

BV Raghavulu: విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం ఇప్పుడు మరో ఎత్తు గడ..

విశాఖ (Visakha): స్టీల్ ప్లాంట్‌ (Steel plant)పై కేంద్రం ఇప్పుడు మరో ఎత్తు గడ వేసిందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు (BV Raghavulu) అన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఉత్పత్తి తగ్గించి, నష్టాలు చూపి స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయాలనే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం (BJP Govt.) కార్పొరేట్లను కొమ్ము కాస్తోందని విమర్శించారు. టీడీపీ (TDP) మినీ మహానాడులో, వైసీపీ ప్లీనరీలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటికరణకు వ్యతిరేకంగా ఎందుకు తీర్మానాలు చెయ్యలేదని ప్రశ్నించారు. 


ఎంపీ గోరంట్ల మాధవ్ (MP Gorantla) రాసలీలల వ్యవహరంలో వైసీపీ ప్రభుత్వం (YCP Govt.) ఉదాసీనంగా ఉందని రాఘవులు విమర్శించారు. ఎస్పీ మీడియా సమావేశం దీనిని నిరుగార్చేలా ఉందన్నారు. గోరంట్ల విషయంలో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఫోరెన్సిక్ లాబ్‌కు రిపోర్ట్ లేకుండా, అది ఫేక్ అని ఎలా చెబుతారని ప్రశ్నించారు. దేశమంతా ఒకటే పన్ను, ఒకటే ఎన్నిక, ఒకటే మాట, అనే నియంతృత్వ ధోరణిలో వెళ్తోందని, అది దేశానికి ప్రమాదమని అన్నారు. ఉచితాలు సంక్షేమంపై చర్చ జరిగేలా కేంద్రమే చేస్తోందని ఆరోపించారు. చైనా దూకుడు, దేశ రక్షణ విషయంలో ప్రధాని మాటలపై తమకు నమ్మకం ఉందన్నారు. ఆజాద్ కా అమృత్ ఉత్సవ్ కాదు.. ఆజాద్ కా సంకల్ప ఉత్సవ్ నిర్వహించాలన్నారు. జగన్ సర్కార్ విపరీతమైన అప్పులు చేస్తోందని బీవీ రాఘవులు అన్నారు.

Updated Date - 2022-08-12T18:05:25+05:30 IST