హైదరాబాద్లో ఆరుగురు యువతులపై బైండోవర్
ABN , First Publish Date - 2021-03-02T13:09:20+05:30 IST
పోలీసులు యువతులను అదుపులోకి తీసుకొని పోలీస్స్టేషన్కు తరలించారు.
హైదరాబాద్/ఘట్కేసర్ : వాహనదారులను ఆపి భిక్షాటన పేరుతో బలవంతంగా డబ్బు లు వసూలు చేస్తున్న ఆరుగురు యువతులపై సోమవారం ఘట్కేసర్ పోలీసులు బైండోవర్ కేసు నమోదు చేశారు. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ నగరానికి చెందిన ఆరుగురు యువతులు సికింద్రబాద్ రైల్వేస్టేషన్ సమీపంలోని ధర్మశాల వద్ద నివాసముంటున్నారు. ఘట్కేసర్ అవుటర్ రింగురోడ్డు సర్వీసు రోడ్డులో వచ్చివెళ్లే వాహనాదారుల వద్ద భిక్షాటన పేరుతో బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. విషయాన్ని గమనించిన స్థానికులు 100 నెంబర్కు సమాచారం అందించడంతో పోలీసులు యువతులను అదుపులోకి తీసుకొని పోలీస్స్టేషన్కు తరలించారు. విచారణ చేపట్టి ఆరుగురు యువతులపై బైండోవర్ కేసు నమోదు చేసినట్టు సీఐ చంద్రబాబు తెలిపారు.