గన్నవరంలో టీడీపీకి పూర్వవైభవం తెస్తా!
ABN , First Publish Date - 2020-09-29T10:17:04+05:30 IST
గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంపై మొదటి నుంచి టీడీపీకి పట్టు ఉందని, ఆ పూర్వ వైభ వాన్ని తీసుకువస్తానని ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు అన్నారు. మచి లీపట్నంలోని తన కార్యాలయం వద్ద టీడీపీ నేతలు పి.వి. ఫణికుమార్, గంజాల రవికుమార్, డా బొల్లా సీతారామ్ అర్జునుడును సత్కరించారు.
ఎమ్మెల్సీ అర్జునుడు
మచిలీపట్నం టౌన్, సెప్టెంబరు 28 : గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంపై మొదటి నుంచి టీడీపీకి పట్టు ఉందని, ఆ పూర్వ వైభ వాన్ని తీసుకువస్తానని ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు అన్నారు. మచి లీపట్నంలోని తన కార్యాలయం వద్ద టీడీపీ నేతలు పి.వి. ఫణికుమార్, గంజాల రవికుమార్, డా బొల్లా సీతారామ్ అర్జునుడును సత్కరించారు. ఈ సందర్భంగా అర్జునుడు మాట్లాడుతూ గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్ధి విజయం సాధించినప్పటికీ వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్నారు. నియోజకవర్గంలో మళ్ళీ టీడీపీకి అనుకూల వాతావరణం తెచ్చేందుకు కృషి చేస్తామన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజా సమస్యలపై స్పందిస్తానని అర్జునుడు అన్నారు.