అగ్రిగోల్డ్ బాధితులకు సొమ్ము చెల్లించాలి
ABN , First Publish Date - 2020-09-29T10:24:13+05:30 IST
అగ్రిగోల్డ్ బాధితులకు సొమ్ము చెల్లించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద సోమవారం రాజకీయ పార్టీల నాయకులు ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు దాదాసాహెబ్, ఎన్.కుమారి, సీపీఐ నాయకులు మోదుమూడి రామారావు, నాగరాజు, బాధితుల సంక్షేమ
మచిలీపట్నం టౌన్, సెప్టెంబరు 28 : అగ్రిగోల్డ్ బాధితులకు సొమ్ము చెల్లించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద సోమవారం రాజకీయ పార్టీల నాయకులు ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు దాదాసాహెబ్, ఎన్.కుమారి, సీపీఐ నాయకులు మోదుమూడి రామారావు, నాగరాజు, బాధితుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు కె.వాసు, పి. బాలశంకరరావు, టి. ఏడుకొండలు, కె. రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
కైకలూరు : అగ్రిగోల్డు బాధితులకు డిసెంబరులోపు సొమ్ము చెల్లించాలని నియోజకవర్గ అగ్రిగోల్డు బాధితుల సంఘం అధ్యక్షుడు చక్కా జగన్మోహనరావు డిమాండ్ చేశారు. తహసీల్దార్ సాయి కృష్ణకుమారికి సోమవారం ఈ మేరకు వినతిపత్రాన్ని అందజేశారు. కలిదిండి మం డల శాఖ అధ్యక్షుడు ఎ.వెంకటరాంబాబు, సెక్రటరీ పచ్చిగోళ్ల లలితా ప్రసాద్, నిడుమోలు కుమారి, సత్యనారాయణమ్మ, కోలాకుమారి పాల్గొన్నారు.
పెడన : అగ్రిగోల్డ్ బాధితులకు సత్వరమే సొమ్ము చెల్లించాలని కోరుతూ తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం వినతిపత్రం అందజేశారు. అసోసియేషన్ సభ్యులు గగన్, కనకమల్లేశ్వరరావు, రాంబాబు తదితరులు ఉన్నారు.