కరోనాకు మరో ఐదుగురు బలి
ABN , First Publish Date - 2020-10-27T09:58:12+05:30 IST
జిల్లాలో కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తోంది. గడచిన 48 గంటల్లో మరో ఐదుగురిని బలి తీసుకుంది. కొత్తగా 457 మందికి వైరస్ సోకింది.
జిల్లాలో మొత్తం కేసులు 37,222
(ఆంధ్రజ్యోతి, విజయవాడ): జిల్లాలో కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తోంది. గడచిన 48 గంటల్లో మరో ఐదుగురిని బలి తీసుకుంది. కొత్తగా 457 మందికి వైరస్ సోకింది. ఈ కొత్త కేసులతో కలిపి జిల్లాలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 37,222కు చేరుకున్నాయి. కరోనా మరణాలు అధికారికంగా 551కి పెరిగాయి. కొవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల్లో 530 మంది వ్యాధి నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. ఇంకా 3,414 మంది బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.