అసత్య ప్రచారాలొద్దు
ABN , First Publish Date - 2020-11-04T10:54:42+05:30 IST
అమరావతిపై అసత్య ప్రచారాలు చేస్తూ పాలకులు ప్రజలను మోసం చేస్తున్నారని రాజధాని రైతులు, మహిళలు మండిపడ్డారు.
322వ రోజు ఆందోళనల్లో రాజధాని రైతులు
తుళ్లూరు/తాడేపల్లి/మంగళగిరి/తాడికొండ, నవంబరు 3: అమరావతిపై అసత్య ప్రచారాలు చేస్తూ పాలకులు ప్రజలను మోసం చేస్తున్నారని రాజధాని రైతులు, మహిళలు మండిపడ్డారు. అమరావతి రాష్ట్ర ఏకైక రాజధానిగా కొనసాగాలని రైతులు, రైతు కూలీలు చేస్తున్న ఉద్యమం మంగళవారం 322వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారం చేపట్టక ముందు అమరావతే రాజధాని అంటూ జపం చేసిన జగన్ ఇప్పుడు మూడు రాజధానులు అంటూ విషం చిమ్మారన్నారు. కాగా, తాడేపల్లి మండలం పెనుమాకలో జరుగుతున్న దీక్షలు 322వరోజుకు చేరుకున్నాయి. మంగళగిరి మండలం కృష్ణాయపాలెం, యర్రబాలెం, నవులూరు, బేతపూడి, నిడమర్రు, నీరుకొండ గ్రామాల్లోని దీక్షలకు ఆయా గ్రామాల రైతు సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. తాడికొండ మండలం పొన్నెకల్లు, మోతడక గ్రామాల్లో రైతులు, మహిళలు నిరసనలు కొనసాగించారు.