మరో ప్రమాదంలో బాలిక మృతి

ABN , First Publish Date - 2020-11-04T10:59:24+05:30 IST

మండలంలోని దాములూరు-పల్లెంపల్లి సమీ పంలోని వైరా కట్టలేరులో ప్రమాదవశాత్తు బా లిక కాలు జారిపడి మృతి చెందింది.

మరో ప్రమాదంలో బాలిక మృతి

వీరులపాడు, నందిగామ రూరల్‌ : మండలంలోని దాములూరు-పల్లెంపల్లి సమీ పంలోని వైరా కట్టలేరులో ప్రమాదవశాత్తు బా లిక కాలు జారిపడి మృతి చెందింది. కంచికచర్ట పట్టణంలోని అరుంధతీ నగర్‌కు చెందిన శేషం నాగరాజుకు ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె లావణ్య (17) తన అక్క బాబి, కొంతమంది మహిళలతో కలిసి నందిగామ మండలం దాములూరులోని తన అమ్మమ్మ సంస్మరణకు వచ్చింది. గ్రామ సమీపంలోని వైరా కట్టలేరు వద్దకు రాగా కాలుజారి వైరా కట్టలేరులో పడి పోవటంతో తనతో వచ్చిన అక్క, మహిళలు కేకలు వేయటంతో సమీపంలోని యువకులు వచ్చి బాలికను ఒడ్డుకు చేర్చారు. కొన ఊపిరి తో ఉన్న బాలికను వీరులపాడు పీహెచ్‌సీకి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. చేతికొచ్చిన కుమార్తె మృతి చెందటంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

Updated Date - 2020-11-04T10:59:24+05:30 IST