కేసులకు భయపడం
ABN , First Publish Date - 2020-11-05T11:31:44+05:30 IST
ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు బనాయించినా అమరావతి ఉద్యమాన్ని ఆపేది లేదని రాజధాని రైతులు తేల్చిచెప్పారు.
323వ రోజు ఆందోళనల్లో రాజధాని రైతులు
తుళ్లూరు/మంగళగిరి/తాడేపల్లి, నవంబరు 4 : ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు బనాయించినా అమరావతి ఉద్యమాన్ని ఆపేది లేదని రాజధాని రైతులు తేల్చిచెప్పారు. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని చేస్తున్న ఉద్యమం బుధవారం 323వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా రైతులు, మహిళలు మాట్లాడుతూ అమరావతి ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తే ఆ పాపం ఊరికే పోదన్నారు. పెదపరిమి, తుళ్లూరు, నేలపాడు, ఐనవోలు, వెంకటపాలెం, మందడం, వెలగపూడి, రాయపూడి, దొండపాడు, అబ్బరాజుపాలెం, అనంతవరం, బోరుపాలెం గ్రామాల్లోని రైతు దీక్షా శిబిరాలు బుధవారం కూడా కొనసాగాయి. మంగళగిరి మండలం కృష్ణాయపాలెం, యర్రబాలెం, నవులూరు, బేతపూడి, నిడమర్రు, నీరుకొండ, తాడేపల్లి మండలం పెనుమాకలో జరుగుతున్న రైతుల దీక్షలు 323వరోజుకు చేరుకున్నాయి.