తగ్గిన ప్రయాణికులు
ABN , First Publish Date - 2020-11-05T11:32:45+05:30 IST
విజయవాడ నుంచి హైదరాబాద్కు వెళ్లే ప్రయాణికులు తగ్గడంతో బుధవారం ఆర్టీసీ అధికారులు 10 బస్సులను కుదించారు.
హైదరాబాద్కు ఆర్టీసీ బస్సుల కుదింపు
విజయవాడ, ఆంధ్రజ్యోతి : విజయవాడ నుంచి హైదరాబాద్కు వెళ్లే ప్రయాణికులు తగ్గడంతో బుధవారం ఆర్టీసీ అధికారులు 10 బస్సులను కుదించారు. హైదరాబాద్కు సర్వీసులు ప్రారంభించిన మూడోరోజు బుధవారం 40 బస్సులకు ఆర్టీసీ కృష్ణా రీజియన్ అధికారులు రిజర్వేషన్ను ప్రారంభించారు. తెలంగాణావైపు నుంచి మాత్రం 50 బస్సులకు రిజర్వేషన్ను కల్పించారు. అయితే, కృష్ణా రీజియన్ నుంచి పెద్దగా డిమాండ్ లేకపోవటంతో 10 బస్సులను తగ్గించుకున్నారు. తెలంగాణా ఆర్టీసీ అధికారులు మాత్రం మంగళవారంతో పోల్చుకుంటే బుధవారం మరో 25 బస్సులు అదనంగా పెంచుతూ 50 బస్సులకు రిజర్వేషన్ కల్పించారు. అయితే, రిజర్వేషన్ పెద్దగా జరగలేదని తెలుస్తోంది.