మండలి కృష్ణారావు విగ్రహం ధ్వంసం

ABN , First Publish Date - 2020-11-17T10:40:31+05:30 IST

మండల పరిధిలోని మోదుమూడి వద్ద కాంగ్రెస్‌ పార్టీ అభిమాని ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కీర్తిశేషులు, మాజీ మంత్రి మండలి వెంకట కృష్ణారావు విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.

మండలి కృష్ణారావు విగ్రహం ధ్వంసం

అవనిగడ్డ రూరల్‌, నవంబరు 15 : మండల పరిధిలోని మోదుమూడి వద్ద కాంగ్రెస్‌ పార్టీ అభిమాని ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కీర్తిశేషులు, మాజీ మంత్రి మండలి వెంకట కృష్ణారావు విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. మోదుమూడికి చెందిన భూపతి యానాది ఆధ్వర్యంలో రాజశేఖర్‌రెడ్డి, అల్లూరి సీతారామారావు, ఇందిరాగాంధీ, మండలి వెంకట కృష్ణారావు విగ్రహాలను ఏర్పాటు చేశారు. శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు మండలి వెంకట కృష్ణారావు విగ్రహాన్ని ధ్వంసం చేశారని పలువురు టీడీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.


దివిసీమ గాంధీగా పేరొందిన మండలి వెంకట కృష్ణారావు అవనిగడ్డ నియోజకవర్గానికి ఎన్నో సేవలందించారని అన్నారు. దివిసీమ అభివృద్ధిలో మండలి వెంకట కృష్ణారావు పాత్ర ఉందని, అలాంటి మహనీయుడి విగ్రహాన్ని ధ్వంసం చేయటం దారుణమని అన్నారు. అవనిగడ్డ మండల టీడీపీ అధ్యక్షుడు యాసం చిట్టిబాబు, మాజీ జడ్పీటీసీ కొల్లూరి వెంకటేశ్వరరావు, మండలి వెంకట రామ్మోహనరావు, గాజుల మురళీకృష్ణ, బండే రాఘవ తదితరులు నిరసనలో పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-17T10:40:31+05:30 IST