అఫ్ఘాన్ నుంచి స్వదేశానికి చేరుకున్న భారత రాయబారి.. మరో 142 మంది ప్రవాసులు

ABN , First Publish Date - 2021-08-17T17:53:45+05:30 IST

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సీ-17 విమానంలో అఫ్ఘానిస్థాన్‌లోని భారత రాయబారి రుద్రేంద్ర టాండన్ మంగళవారం స్వదేశానికి చేరుకున్నారు.

అఫ్ఘాన్ నుంచి స్వదేశానికి చేరుకున్న భారత రాయబారి.. మరో 142 మంది ప్రవాసులు

న్యూఢిల్లీ: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సీ-17 విమానంలో అఫ్ఘానిస్థాన్‌లోని భారత రాయబారి రుద్రేంద్ర టాండన్ మంగళవారం స్వదేశానికి చేరుకున్నారు. ఆయనతో పాటు ఎంబసీ సిబ్బంది, ఐటీబీపీ జవాన్లు మొత్తం 142 మందితో సీ-17 విమానం గుజరాత్‌లోని జామ్‌నగర్ ఎయిర్‌బేస్ చేరుకుంది. కాగా, కాబూల్ విమానాశ్రయంలో ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా వీరిని సోమవారం సాయంత్రమే సురక్షిత ప్రాంతానికి తరలించారు. తాజాగా వారందరిని సీ-17 విమానంలో భారత్‌కు తీసుకువచ్చారు. ఇక తాలిబన్లు తిరిగి అఫ్ఘానిస్థాన్‌లో పాగ వేయడంతో ఆ దేశంలోని ప్రజలు విదేశాలకు వెళ్లిపోతున్నారు. తాలిబన్ల పాలనలో తాము బతికిబట్టకట్టలేమని వాపోతున్నారు. 20 ఏళ్ల కింద తాలిబన్ల అరాచక పాలన నుంచి విముక్తి పొందిన అఫ్ఘాన్ ప్రజలు.. రెండు దశాబ్ధాల తర్వాత మళ్లీ వారి చేతుల్లోకి దేశం వెళ్లిపోవడంతో అక్కడ ఉండలేమంటూ విదేశాలకు తరలిపోతున్నారు.    

Updated Date - 2021-08-17T17:53:45+05:30 IST