పాసింజర్ను హతమార్చి పారిపోయిన క్యాబ్ డ్రైబర్
ABN , First Publish Date - 2022-01-07T00:06:35+05:30 IST
జెవార్ టోల్ ప్లాజా దగ్గర డ్రైవర్ సడెన్గా కారును ఆపాడు. కారులో ఏదో సమస్య తలెత్తిందని అందుకే ఆగిపోయిందని పాసింజర్తో చెప్పాడు. ఇంతలో పాసింజర్ కారులో నుంచి కిందకు దిగాడు..
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో జరిగిన ఓ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ క్యాబ్ డ్రైవర్ తన పాసింజర్ సామాన్లను చోరీ చేసే క్రమంలో అతడిని హతమార్చాడు. తన క్యాబ్ నుంచి పాసింజర్ను రోడ్డుపై వస్తున్న వామనం కిందకు తోయడంతో అక్కడికక్కడే మరణించాడు. అనంతరం పాసింజర్ సామాన్లతో అక్కడి నుంచి క్యాబ్ డ్రైవర్ ఉడాయించాడు. ఈ దారుణం యమునా ఎక్స్ప్రెస్వేపై నవంబర్ 7న జరిగినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. నిందితుడైన క్యాబ్ డ్రైవర్ను బుధవారం పట్టుకున్నట్లు, అతడి నుంచి కొన్ని సామాన్లను స్వాధీనం చేసుకున్నట్లు వారు తెలిపారు.
ఈ విషయమై దంకౌర్ పోలీస్ స్టేషన్ హౌజ్ ఆఫీసర్ సుధీన్ కుమార్ మాట్లాడుతూ‘‘జెవార్ టోల్ ప్లాజా దగ్గర డ్రైవర్ సడెన్గా కారును ఆపాడు. కారులో ఏదో సమస్య తలెత్తిందని అందుకే ఆగిపోయిందని పాసింజర్తో చెప్పాడు. ఇంతలో పాసింజర్ కారులో నుంచి కిందకు దిగాడు. ఇదే అదనుగా అతడిని రోడ్డుపై వస్తున్న ఓ వాహనం కిందకు తోసి, పాసింజర్ సామానుతో ఉడాయించాడు. జెవాస్ టోల్ ప్లాజా సమీపంలోని సీసీటీవీ పుటేజీలన్నీ పరిశీలించి క్యాబ్ను గుర్తించాం. క్యాబ్ వివరాలతో నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశాం’’ అని తెలిపారు.