Chennai: క్యాబ్ డ్రైవర్ అరాచకం.. పాసింజర్‌ను ఫోన్‌తో కొట్టి చంపాడు.. కారణం ఏంటంటే..

ABN , First Publish Date - 2022-07-06T20:54:38+05:30 IST

చిన్న విషయానికే తీవ్ర ఆగ్రహానికి గురైన క్యాబ్ డ్రైవర్ ఓ పాసింజర్‌పై దాడికి దిగాడు.

Chennai: క్యాబ్ డ్రైవర్ అరాచకం.. పాసింజర్‌ను ఫోన్‌తో కొట్టి చంపాడు.. కారణం ఏంటంటే..

చిన్న విషయానికే తీవ్ర ఆగ్రహానికి గురైన క్యాబ్ డ్రైవర్ ఓ పాసింజర్‌పై దాడికి దిగాడు. తన మొబైల్ ఫోన్‌తో పదే పదే కొట్టి చంపేశాడు. స్థానికులు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కోయంబత్తురులో ఉద్యోగం చేస్తున్న ఉమేంద్ర అనే వ్యక్తి తన భార్య, పిల్లలతో కలిసి చెన్నైలోని బంధువుల ఇంటికి వెళ్లాడు. అక్కడ నుంచి అందరూ కలిసి షాపింగ్ మాల్‌కు వెళ్లారు. అక్కడ సినిమా చూసి తిరిగి ఇంటికి వెళ్లేందుకు క్యాబ్ బుక్ చేశారు. 


ఇది కూడా చదవండి..

Viral video: కొడుకు ప్రోగ్రస్ కార్డు చూసి గుక్కపెట్టి ఏడ్చిన తండ్రి.. ఏడాది పాటు ట్యూషన్ పెట్టిస్తే ఆ కుర్రాడికి వచ్చిన మార్కులు ఎన్నంటే..


మొత్తం ఏడుగురు పాసింజర్‌లు ఉండడం చూసి క్యాబ్ డ్రైవర్ రవి అసహనానికి గురయ్యాడు. ఓటీపీ చెప్పకుండానే వారందరూ కారులో కూర్చోవడంతో ఆగ్రహానికి గురయ్యాడు. ఏడుగురికి తన క్యాబ్ సరిపోదని, వేరే కారు బుక్ చేసుకోవాలని చెప్పాడు. అందరినీ కిందకు దించేసి ఉమేంద్రతో వాగ్వాదానికి దిగాడు. ఆ క్రమంలో తన మొబైల్ ఫోన్‌తో ఉమేంద్ర నుదిటిపై కొట్టాడు. దీంతో ఉమేంద్ర అక్కడికక్కడే పడిపోయాడు. వెంటనే హాస్పిటల్‌కు తరలించినప్పటికీ అతను ప్రాణాలు కోల్పోయాడు. స్థానికులు రవిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని రిమాండ్‌కు తరలించారు. 

Updated Date - 2022-07-06T20:54:38+05:30 IST