ఆయుష్మాన్ భారత్‌ డిజిటల్ మిషన్‌కు క్యాబినేట్ ఆమోదం

ABN , First Publish Date - 2022-02-26T21:35:23+05:30 IST

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఏబీడీఎమ్)కు క్యాబినేట్ ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శనివారం సమావేశమైన కేంద్ర క్యాబినేట్ ఏబీడీఎమ్ స్కీమ్‌ను ఆమోదిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఆయుష్మాన్ భారత్‌ డిజిటల్ మిషన్‌కు క్యాబినేట్ ఆమోదం

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఏబీడీఎమ్)కు క్యాబినేట్ ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శనివారం సమావేశమైన కేంద్ర క్యాబినేట్ ఏబీడీఎమ్ స్కీమ్‌ను ఆమోదిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ పథకం కోసం వచ్చే ఐదేళ్లకుగాను, 1,600 కోట్లు కేటాయించింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని ఈ పథకాన్ని నేషనల్ హెల్త్ అథారిటీ (ఎన్‌హెచ్ఏ) అమలు చేస్తుంది.


ఈ పథకం కింద పౌరులు ‘ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ (ఏబీహెచ్ఏ)’ ఓపెన్ చేసుకోవచ్చు. హెల్త్‌కు సంబంధించిన రికార్డులను డిజిటల్‌గా నమోదు చేసుకోవచ్చు. ఈ రికార్డులు వైద్య రంగంలో సేవలందించే వారికి ఉపయోగపడతాయి. డిజిటల్ టెక్నాలజీని వాడుకోవడం ద్వారా మరింత మెరుగైన వైద్య సేవలు పొందే వీలవుతుందనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం కింద ఇప్పటివరకు 17 కోట్లకు పైగా అకౌంట్స్ ఓపెన్ అయ్యాయని కేంద్రం ప్రకటించింది.

Updated Date - 2022-02-26T21:35:23+05:30 IST