రేపు ఏపీ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
ABN , First Publish Date - 2020-11-26T23:35:46+05:30 IST
రేపు ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం దిశా నిర్దేశం చేయనున్నారు.
అమరావతి: రేపు ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం దిశా నిర్దేశం చేయనున్నారు. ముఖ్యంగా అసెంబ్లీలో ప్రవేశ పెట్టబోయే బిల్లులపై చర్చిస్తారు. అంతేగాకుండా రాష్ట్రంలో నివర్ తుఫాన్, పంట నష్టం అంచనాలపై సీఎంకు మంత్రులు, అధికారులు వివరిస్తారు. ఈ భేటీలో స్థానిక ఎన్నికలపై కూడా చర్చించే అవకాశం ఉంది. కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి కావాల్సిన ఏర్పాట్లపై సీఎం జగన్ మంత్రులతో చర్చిస్తారు.