ప్రశాంతంగా ఎన్ఎంఎంఎస్ పరీక్షలు
ABN , First Publish Date - 2021-03-01T05:01:26+05:30 IST
జిల్లాలో ఎన్ఎంఎస్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఆదివారం జిల్లా వ్యాప్తంగా 13 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించారు.
విజయనగరం (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎన్ఎంఎస్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఆదివారం జిల్లా వ్యాప్తంగా 13 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 2,881 మందికి 2,797 మంది విద్యార్థులు హజరయ్యారు. 84 మంది పరీక్షలకు దూరంగా ఉన్నారు. అదే విధంగా 7 సెంటర్లలో ఎన్టీఎస్ఈ పరీక్షలు నిర్వహించారు. 1564 మందికి గాను, 1334 మంది విద్యార్థులు హాజరయ్యారు. 230 మంది గైర్హాజరయ్యారు. జిల్లా కేంద్రంలోని పలు పరీక్ష కేంద్రాలను డీఈవో నాగమణి పరిశీలించారు.