ప్రశాంతంగా పాలిసెట్‌

ABN , First Publish Date - 2022-07-01T05:40:22+05:30 IST

వనపర్తి జిల్లా కేం ద్రంలో గురువారం పాలిసెట్‌ పరీక్షలు ప్రశాం తంగా జరిగాయి.

ప్రశాంతంగా పాలిసెట్‌
వనపర్తిలో పాలిసెట్‌ పరీక్షలు రాయడానికి వస్తున్న విద్యార్థినీ


వనపర్తి రూరల్‌, జూన్‌ 30: వనపర్తి జిల్లా కేం ద్రంలో గురువారం పాలిసెట్‌ పరీక్షలు ప్రశాం తంగా జరిగాయి. జిల్లాలో మొత్తం 11 సెంటర్లలో ఈ పరీక్షలు కొనసాగాయి. విద్యార్థులు అరగంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు హాజరయ్యారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆయా పరీక్షా కేంద్రాల వద్ద హాల్‌టికెట్‌ నంబర్‌ను సులువుగా గుర్తుంచుకునే విధంగా ఏర్పాట్లు చేశా రు. మొత్తం 11 పరీక్షా కేంద్రాల్లో 2,523 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 2,377 మం ది విద్యార్థులు హాజరై, 146 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. పరీక్షా కేంద్రాలను ఎప్పటిక ప్పుడు పాలిసెట్‌ పరీక్షల కోఆర్డినేటర్‌ చంద్రశేఖర్‌, స్పెషల్‌ అబ్జర్వర్‌ శ్రీనివాసరావు తనిఖీలు చేశారు. 





Updated Date - 2022-07-01T05:40:22+05:30 IST