సంస్కృతి, సంప్రదాయాలు నేటితరానికి తెలియాలి

ABN , First Publish Date - 2022-06-30T06:09:20+05:30 IST

సంస్కృతి, సంప్రదాయాలు నేటితరానికి తెలియాలి

సంస్కృతి, సంప్రదాయాలు నేటితరానికి తెలియాలి
వెంకట్రామయ్య జీవిత చరిత్ర పుస్తకావిష్కరణ చేస్తున్న రాజేంద్రప్రసాద్‌

ఉయ్యూరు, జూన్‌ 29 : సంస్కృతి, సంప్రదాయాలు, సాహిత్యం నేటితరానికి తెలి యజేస్తూ సరసభారతి సాహిత్య అకాడమి ద్వారా కృషి చేస్తున్న గబ్బిట దుర్గాప్రసాద్‌ అభినం దనీయుడని టీడీపీ రాష్ట్ర ఉపా ధ్యక్షుడు వైవీబీ రాజేంద్ర ప్రసాద్‌ ప్రస్తుతించారు. సరస భారతి సాహిత్య అకాడమి వ్యవస్థాపకుడు గబ్బిట దుర్గాప్రసాద్‌ జన్మదినం పురస్క రించుకుని బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని దుర్గాప్రసాద్‌ రచించిన ఉయ్యూరుకు చెందిన ప్రస్తుతం అమెరికాలో ఉం టున్న న్యూక్లియర్‌ శాస్త్రవేత్త ఆకునూరి వెంకట్రామయ్య జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు. దివి చిన్మయ, రమణ దుర్గాప్రసాద్‌కు శుభాకాంక్షలు తెలిపారు. 

Updated Date - 2022-06-30T06:09:20+05:30 IST