సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలు అదుపు
ABN , First Publish Date - 2020-11-30T04:58:10+05:30 IST
నేరాల అదుపునకే సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు చింతలమానేపల్లి ఎస్సై సందీప్ కుమార్ తెలిపారు.
-ఎస్సై సందీప్ కుమార్
చింతలమానేపల్లి, నవంబరు29: నేరాల అదుపునకే సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు చింతలమానేపల్లి ఎస్సై సందీప్ కుమార్ తెలిపారు. మండలంలోని బూరెపెల్లి గ్రామంలో ఆదివారం సర్పంచ్ మోర్లె గణపతితో కలిసి సీసీ కెమెరాలను అమర్చారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ బూరెపెల్లి సరిహద్దు గ్రామం అయినందున సీసీ కెమెరాలతో గ్రామానికి కొత్త వ్యక్తులు ఎవరైనా వస్తున్నారో గమనించడానికి వీలుంటుందని అన్నారు. అలాగే గ్రామంలో అవాంఛనీయ ఘటనలు జరగడానికి ఆస్కారం ఉండదని పేర్కొ న్నారు. ప్రజలు శాంతి భద్రతల విషయంలో సహకరించాలని తెలిపారు. మఖ్యంగా యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. మండలంలో అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో గ్రామ స్థులు అల్లూరి దివాకర్, జాడి నారాయణ, మెస్రం గోపి, సంజీవ్, పోచయ్య, సాగర్, మోహన్, తదితరులు పాల్గొన్నారు.