ప‌రీక్షల రద్దుపై రేపు సుప్రీంలో విచార‌ణ‌

ABN , First Publish Date - 2021-06-24T01:34:42+05:30 IST

ప‌రీక్షల రద్దుపై రేపు సుప్రీంలో విచార‌ణ‌

ప‌రీక్షల రద్దుపై రేపు సుప్రీంలో విచార‌ణ‌

అమరావతి: వివిధ రాష్ట్రాల బోర్డు ప‌రీక్షల రద్దు పిటీష‌న్‌పై రేపు గురువారం సుప్రీంకోర్టులో విచార‌ణ‌ జరుగనుంది. పిటీష‌న్‌ విచారణకు రానున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ ధాఖలు చేసింది. 12వ తరగతి పరీక్షలు నిర్వహిస్తామని సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. కేసుల సంఖ్య వేగంగా తగ్గతున్న నేపథ్యంలో పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది. పదో తరగతిలో మార్కులు కాకుండా గ్రేడ్లు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు మార్కులు లెక్కించడం సరికాదని పేర్కొంది. 


స్కూల్ అంతర్గతంగా ఇచ్చిన మార్కులపై బోర్డులకు నియంత్రణ లేదని, అందువల్ల కచ్చితమైన మార్కులు ఇవ్వడం సాధ్యం కాదని ఏపీ ప్రభుత్వం తెలిపింది. రోజు విడిచి రోజు పరీక్షలు నిర్వహిస్తామని సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం పేర్కొంది. గదికి 15 నుంచి 18 మంది మించకుండా చూస్తామని, ప్రతి పరీక్షా కేంద్రం వద్ద కొవిడ్ ప్రోటోకాల్ పాటిస్తామని ఏపీ ప్రభుత్వం తెలిపింది. 


Updated Date - 2021-06-24T01:34:42+05:30 IST