TS News: బండి సంజయ్ బహిరంగ సభకు అనుమతి రద్దు

ABN , First Publish Date - 2022-08-26T03:35:25+05:30 IST

హనుమకొండ: బీజేపీ (BJP) తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) పాదయాత్ర ఈ నెల 27తో ముగుస్తుంది. అదే రోజు హన్మకొండ ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో బహిరంగ సభను నిర్వహణకు ఏర్పాట్లు జరుగు తున్నాయి. ఈ క్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్ సభ నిర్వహణకు అనుమతి నిరాకరించారు. పోలీసుల నుంచి ఎలాంటి

TS News: బండి సంజయ్ బహిరంగ సభకు అనుమతి రద్దు

హనుమకొండ: బీజేపీ (BJP) తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) పాదయాత్ర ఈ నెల 27తో ముగుస్తుంది. అదే రోజు హన్మకొండ ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో బహిరంగ సభను నిర్వహణకు ఏర్పాట్లు జరుగు తున్నాయి. ఈ క్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్ సభ నిర్వహణకు అనుమతి నిరాకరించారు. పోలీసుల నుంచి ఎలాంటి సమాచారం లేనందున అనుమతి రద్దు చేస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు. కాగా బీజేపీ నాయకులు ఇప్పటికే గ్రౌండ్ కోసం రూ. 5 లక్షలు చెల్లించారు. బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా హాజరవుతున్నందున సభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో మరో మారు కోర్టు మెట్లు ఎక్కేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. సభ నిర్వహించుకునేందుకు నిన్న అనుమతి ఇచ్చి ఇవాళ రద్దు చేయడమేంటని  బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ ప్రశ్నిస్తున్నారు. సీఎం కేసీఆర్ (CM KCR)  కావాలనే అడ్డంకుంటున్నారని ఆరోపించారు. కోర్టుకు వెళ్లి సభ నిర్వహణకు అనుమతి తెచ్చుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

Updated Date - 2022-08-26T03:35:25+05:30 IST