టైలర్‌ షాపులో గంజాయి విక్రయం

ABN , First Publish Date - 2020-11-29T05:40:21+05:30 IST

టైలరింగ్‌ షాపులో గంజాయి అమ్ముతున్నారనే సమాచారంతో ఎక్సైజ్‌ టాస్క్‌పోర్స్‌ అధికారులు నిర్వహించి ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.

టైలర్‌ షాపులో గంజాయి విక్రయం

తూప్రాన్‌, నవంబరు 28: టైలరింగ్‌ షాపులో గంజాయి అమ్ముతున్నారనే సమాచారంతో ఎక్సైజ్‌ టాస్క్‌పోర్స్‌ అధికారులు నిర్వహించి ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. మెదక్‌ ఎక్సైజ్‌ టాస్క్‌పోర్సు సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలో టైలరింగ్‌ నిర్వహిస్తున్న సంగ నర్సింహులు కొద్ది రోజులుగా గంజాయి అమ్ముతున్నాడు. ఈ విషయంపై నమ్మకమైన సమాచారం రావడంతో శనివారం పట్టణంలోని నర్సింహులు ఇళ్లు, టైలర్‌ దుకాణంపై దాడులు చేయగా రూ. 10వేల విలువైన 910 గ్రాముల ఎండు గంజాయి పట్టుబడినట్లు పేర్కొన్నారు. పట్టుబడిన గంజాయితో సహా నిందితుడిని నర్సాపూర్‌ ఎక్సైజ్‌ స్టేషన్‌లో అప్పగించినట్లు ఎస్‌ఐ వివరించారు.

Updated Date - 2020-11-29T05:40:21+05:30 IST