కోహ్లీ రెడీగా ఉండగా.. బంతులు వృధా చేయలేం: సంజూ శాంసన్
ABN , First Publish Date - 2020-08-09T04:10:26+05:30 IST
టీ20 ఫార్మాట్లో వేగంగా పరుగులు చేయాల్సి ఉంటుందని, బంతులను వృధా చేయకూడదని భారత యువబ్యాట్స్మెన్ సంజూ శాంసన్ అన్నాడు.
బెంగళూరు: టీ20 ఫార్మాట్లో వేగంగా పరుగులు చేయాల్సి ఉంటుందని, బంతులను వృధా చేయకూడదని భారత యువబ్యాట్స్మెన్ సంజూ శాంసన్ అన్నాడు. ఈ ఫార్మాట్లో సాధ్యమైనంత త్వరగా పరుగులు చేయాలన్న సంజు.. ‘ప్యాడ్స్ కట్టుకొని బరిలో దిగడానికి విరాట్ కోహ్లీ సిద్ధంగా ఉండగా, మనం 10 బంతులు వేస్ట్ చేయలేం కదా’ అని పేర్కొన్నాడు. తాను కూడా టెక్నిక్కు పదును పెట్టుకుంటున్నానని, అయితే తన బ్యాటింగ్ స్టైల్లో పెద్దగా మార్పులేవీ ఉండబోవని చెప్పాడు.