మొదటిరోజు ముగిసిన రాజధాని రైతుల పాదయాత్ర
ABN , First Publish Date - 2021-11-01T23:49:44+05:30 IST
రాజధాని రైతుల పాదయాత్ర మొదటిరోజు ముగిసింది. తాడికొండ సాయిబాబా గుడి దగ్గర తొలిరోజు పాదయాత్రకు విరామిచ్చారు.
అమరావతి: రాజధాని రైతుల పాదయాత్ర మొదటిరోజు ముగిసింది. తాడికొండ సాయిబాబా గుడి దగ్గర తొలిరోజు పాదయాత్రకు విరామిచ్చారు. తొలిరోజు 14.5 కిలోమీటర్లు మహా పాదయాత్ర కొనసాగింది. మంగళవారం ఉదయం 8 గంటలకు రెండో రోజు పాదయాత్ర ప్రారంభిస్తారు. అమరావతి రైతులు తమ గోడు వినిపించేందుకు తిరుమల వెంకన్న వద్దకు వెళ్లనున్నారు. అమరావతి పోరులో భాగంగా న్యాయస్థానం టు దేవస్థానం వరకు జరిగే అమ రావతి రైతుల మహా పాదయాత్ర సోమవారం నుంచి ప్రారంభించారు. ఇప్పటికే కాంగ్రెస్, జనసేన, సీపీఎం, సీపీఐ, బీజేపీ, దళిత బహుజన ఫ్రంట్ పార్టీలతో పాటు వివిధ సంఘాలు కూడా రాజధాని రైతుల మహా పాదయాత్రకు మద్దతు తెలిపాయి.