అమిత్‌షాతో భేటీ కానున్న కెప్టెన్ అమరీందర్

ABN , First Publish Date - 2021-10-27T20:00:09+05:30 IST

కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్‌షాను గురువారంనాడు తాను కలుసుకోనున్నట్టు..

అమిత్‌షాతో భేటీ కానున్న కెప్టెన్ అమరీందర్

న్యూఢిల్లీ: కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్‌షాను గురువారంనాడు తాను కలుసుకోనున్నట్టు పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ తెలిపారు. సాగు చట్టాల అంశంపై తాను ఈ సమావేశంలో చర్చించనున్నట్టు చెప్పారు. బుధవారంనాడిక్కడ మీడియాతో ఆయన మాట్లాడుతూ, సుమారు 25-30 మందితో హోం మంత్రిని కలుసుకోనున్నట్టు చెప్పారు.


ఎన్నికల కమిషన్‌ను ఆమోదం లభించగానే తాను స్థాపించనున్న కొత్త పార్టీ పేరు, గుర్తు ప్రకటిస్తానని తెలిపారు. సమయం వచ్చినప్పుడు మొత్తం 117 స్థానాల్లోనూ పోటీ చేస్తామని, సీట్ల సర్దుబాటు కానీ, సొంతంగా పోటీ చేయడం కానీ ఉంటుందని చెప్పారు. నవజ్యోత్ సింగ్ సిద్ధూకు సంబంధించిన అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ, ఆయన ఎక్కడి నుంచి పోటీ చేసినా అక్కడ పోటీ ఇస్తామని చెప్పారు. కాగా, కెప్టెన్ పెట్టబోయే కొత్త పార్టీకి 'పంజాబ్ లోక్ కాంగ్రెస్' అనే పేరు పెడుతున్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

Updated Date - 2021-10-27T20:00:09+05:30 IST