కృష్ణ జింకల వేటగాళ్ల పట్టివేత
ABN , First Publish Date - 2021-01-16T05:31:43+05:30 IST
కామారెడ్డి జిల్లా పిట్లం అటవీశాఖ రేంజ్ పరిధిలోని బీర్కూర్ అటవీ ప్రాంతంలో వేటాడిన ఇద్దరు వేటగాళ్లను పట్టుకున్నట్లు రేంజ్ అధికారి సంజయ్గౌడ్ శుక్రవారం తెలిపారు.
పిట్లం, జనవరి 15: కామారెడ్డి జిల్లా పిట్లం అటవీశాఖ రేంజ్ పరిధిలోని బీర్కూర్ అటవీ ప్రాంతంలో వేటాడిన ఇద్దరు వేటగాళ్లను పట్టుకున్నట్లు రేంజ్ అధికారి సంజయ్గౌడ్ శుక్రవారం తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం వీరాపూర్ దుబ్బాకు చెందిన కడమంచి సాయిలు, కప్పరి పెద్ద రాములు అదే గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో రెండు కృష్ణ జింకలను వేటాడి హతమార్చారు. వాటిని నిజామాబాద్ జిల్లా వర్ని మండలం అటవీ ప్రాంతం మీదుగా శుక్రవారం తెల్లవారు జామున తరలిస్తుండగా స్థానిక పోలీసులకు సమాచారం అందడంతో వారిని పట్టుకున్నారు. నిందితులను, రెండు కృష్ణ జింకలను పిట్లం అటవీశాఖ రేంజ్ అధికారులకు అప్పగించారు. వీరిపై కేసు నమోదు చేసినట్లు రేంజ్ ఫారెస్టు అధికారి సంజయ్గౌడ్ తెలిపారు.